హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఎంబీఏ పార్ట్టైమ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పెంచినట్టు జేఎన్టీయూ హైదరాబాద్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. త్వరలోనే ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్కు రూ.3,000 చెల్లించాల్సి ఉందని అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణారెడ్డి వెల్లడించారు.