Doctor | అతడొక ప్రభుత్వ వైద్యుడు.. తన దగ్గరకు వచ్చిన రోగుల సమస్యలు తెలుసుకొని వారికి వైద్యం చేసి పంపించాలి. అయితే తానొక పబ్లిక్ సర్వెంట్నని, ప్రజలకు సేవ చేసేందుకు తన ఈ ఉద్యోగం ఉందన్న విషయం మరిచిపోయాడో.. లేదంటే అతడిని విసిగించారో ఏమో తెలియదు.. ఆ డాక్టర్ మాత్రం తాను వైద్యం చేయనని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ రోగులపై ఫైర్ అయ్యాడు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.
ఓ మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి వైద్యం చేయాలని బంధువులు డాక్టర్ను కోరారు. అయితే ఆ డాక్టర్ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రోగులను పట్టించుకోకుండా ఉండడంతో మహిళ బంధువు అతడ్ని పశ్నించింది. ఎమర్జెన్సీ కేసు ఏం కాదని డాక్టర్ అంటుంటే.. ఆమె మెట్లపై నుంచి కళ్లు తిరిగిపడిపోయిందని రోగి తరపు బంధువు అనడం వీడియోలో చూడొచ్చు. దీంతో కోపంతో ఊగిపోయిన డాక్టర్ వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి… నేను వైద్యం చేయను
ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ దురుసు ప్రవర్తన
తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
రోగులను పట్టించుకోకుండా ఉండడంతో వైద్యం చేయాలని డాక్టర్ను కోరిన బంధువులు
వైద్యం చేయను.. ఎవరికి చెప్పుకుంటారో… pic.twitter.com/K0nvFPTJat
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026