Congress Leaders | కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరి కుంపటి వారిదే అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడూ ఏదో ఒక చోట గ్రూప్ వార్ బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు వర్గం ఫైర్ అవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను కాదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల్లో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఆ యుద్దం సెగ కాస్తా హైదరాబాద్లోని గాంధీభవన్కు తాకింది. తాజా
డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్కపై ఫిర్యాదు చేసేందుకు విశ్వప్రసాద్ వర్గం కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్కు వెళ్లారు. అయితే సదరు కాంగ్రెస్ నాయకులను పోలీసులుగాంధీ భవన్లోకి అనుమతించలేదు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రచ్చకెక్కిన గ్రూపు తగాదాలు
కాంగ్రెస్ నాయకులను గాంధీ భవన్లోకి అనుమతించని పోలీసులు
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నూతన మండల అధ్యక్షుల ప్రకటనలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్… pic.twitter.com/mIKjhtiISZ
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2026