న్యూఢిల్లీ, ఆగస్టు 4: విమానయాన సంస్థ ఇండిగో..20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా రూ.10 వేల లోపు చార్జి కలిగిన 20 వేల టికెట్లను ఉచితంగా అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 6 లోపు బుకింగ్ చేసుకున్న వారికి వర్తించనున్నదని పేర్కొంది. ఇండిగో వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే వర్తించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది.