ఆదిలాబాద్ : ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టు( Airport ) కోసం తమ గ్రామ రోడ్డును తీసుకుంటే మొత్తం గ్రామాన్ని తీసుకోవాలని కోరుతూ అనుకుంటా గ్రామస్థులు ధర్నా ( Villagers Protest) నిర్వహించారు. బుధవారం గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్కు తరలివచ్చి బైఠాయించి నిరసన తెలిపారు.ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల నష్టపోతున్న తమ భూములకు రూ.6 కోట్లు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
గ్రామస్థులు ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణానికి చేరుకోవాలంటే కేవలం రెండు కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణం చేస్తుండగా రోడ్డు ఎయిర్పోర్టులో పోతే 16 కిలోమీటర్లు దూర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని పేర్కొన్నారు. రోడ్డుతో పాటు తమ గ్రామాన్ని మొత్తం తీసుకొని ఇతర ప్రాంతంలో తమకు పునరావసం కల్పించాలని కోరారు.