హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అధికమాసం కారణంగా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుపనున్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ 9 రోజులు ఆర్జిత సేవలు అష్టదళ పాదపద్మారాధన సేవ, తిరుప్పావడ సేవ, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణను టీటీడీ రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.