ట్రినిడాడ్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ దీటుగా బదులిస్తోంది. రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు.. మంగళవారం అదే జోరును కొనసాగించి ఆధిక్యంలోకి వచ్చింది. ఓవర్ నైట్ స్కోరు 266/2తో ఆట కొనసాగించిన పాక్.. కడపటి వార్తలు అందే సమయానికి 381/7 స్కోరు చేసింది. రెండో రోజే శతకం బాదిన అబ్దుల్ షఫీక్ (158 బ్యాటింగ్) భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తుండగా బాబర్ ఆజమ్ (88) మరోసారి సెంచరీ ముంగిట విఫలమయ్యాడు. కాగా, తొలి ఇన్నింగ్స్లో విండీస్ 344 పరుగులకు ఆలౌటైంది.