K. Narayana | పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సరిచేయకుండా వదిలేయడం వల్ల దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిణామాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో ఏ అభ్యర్థి ఏ పార్టీ తరఫున పోటీ చేశారో ఎన్నికల కమిషన్ వద్ద స్పష్టమైన రికార్డు ఉంది. ఎన్నికైన తర్వాత పార్టీ మారి, ప్రజల తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తే, ఫిరాయింపు నిర్ధారణైన వెంటనే పదవి రద్దయ్యే విధంగా చట్టాన్ని ఎందుకు మార్చకూడదు?
అని ప్రశ్నించారు.
ఈ దుస్థితికి జాతీయ స్థాయిలో గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా బాధ్యత వహించాలన్నారు. గతంలో కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే, ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఆ లోపాలను సరిచేసే అవకాశం ఉంది. మరి ఎందుకు సరిచేయడం లేదు? ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేలా చట్టాన్ని కఠినతరం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల తీర్పును, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే ఫిరాయింపులను సమర్థించే రాజకీయ నాయకులను చరిత్ర క్షమిందన్నారు.