కడ్తాల్, ఏప్రిల్ 26 : కరోనా వైరస్ అరికట్టేందుకు కలిసికట్టుగా పోరాడుదామని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని ప్రజలకు వైరస్పై అవగాహన కల్పించేందుకు జడ్పీటీసీ దశరథ్నాయక్ ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని సోమవారం ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కరోనాను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నదని చెప్పారు. వైరస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో మొదటిసారిగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసిన జడ్పీటీసీని నాయకులు అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, సీఐ ఉపేందర్, ఎస్సైలు సుందరయ్య, నాగరాజ్, సర్పంచ్లు హరిచంద్నాయక్, యాదయ్య, తులసీరాంనాయక్, భాగ్యమ్మ, భారతమ్మ, సులోచన, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, మంజుల, ప్రియ, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, నాయకులు లాయక్అలీ, లక్పతినాయక్, సేవ్యానాయక్ పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్లకు అండగా ప్రభుత్వం
ప్రైవేట్ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల బియ్యాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల సన్న బియ్యం ప్రభుత్వం అందజేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, ఎంపీటీసీ లచ్చిరాంనాయక్, ఉప సర్పంచ్ రామకృష్ణ, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వీరయ్య, వార్డు సభ్యుడు మహేశ్, నాయకులు రమేశ్నాయక్, వెంకటేశ్, ఇర్షాద్, అంజి, శ్రీను పాల్గొన్నారు.