ఆస్తానా: గత రెండు వారాలుగా అస్తానా (కజకిస్థాన్) వేదికగా జరిగిన ఏషియన్ అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్స్లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో సోమవారం భారత్ ఐదు స్వర్ణాలు నెగ్గగా మంగళవారం మరో ఏడుగురు బాక్సర్లు పసిడి పతకాలతో రాణించారు.
ప్రీతి (54 కిలోలు), నిఖిల్ (57 కిలోలు), ఆకాశ్ (60 కిలోలు), పూనమ్ (57 కిలోలు), ప్రాచి (63 కిలోలు), విశ్వనాథ్ (48 కిలోలు), ముస్కాన్ (75 కిలోలు) గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్ 12 స్వర్ణాలు, 14 రజతాలు, 17 కాంస్య పతకాలతో (మొత్తం 43) రెండో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్ 48 పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది.