దేవరకొండ, ఆగస్టు 18 : నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ మహేశ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం ఆస్పత్రికి వెళ్లిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కేతావత్ మహేష్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా కేతావత్ మహేశ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కేతావత్ నాగు, వడత్య బాలు తదితరులు ఉన్నారు.