మన్సూరాబాద్, మే 7: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి( MLA Sudhir Reddy) అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఎంఈరెడ్డి గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సమక్షంలో దిల్సుఖ్నగర్కు చెందిన బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు బాతరాజు శంకర్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో (Joining BRS) చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉంటూ సమస్యలను తెలుసుకుని పరిష్కరింపజేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు జక్కిడి రఘువీర్రెడ్డి, అత్తాపురం రాంచంద్రారెడ్డి, రుద్ర యాదగిరి, సిద్దగౌని జగదీష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.