హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరిగిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశానికి ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఆ పార్టీని ఓడించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆ పార్టీ నాయకులకు మించిన అవినీతిపరులు ఎవరూ లేరని విమర్శించారు. మోదీ పవర్ఫుల్గా మారి ప్రాంతీయ పార్టీ నేతలను జేబుల్లో పెట్టుకున్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల జోలికొస్తే ఎవరైనా పతనం కావాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో సెంటిమెంటు లేదని, బీజేపీ-బీఆర్ఎస్లను ఓడించాలని ప్రజలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తమ బలమేంటో చూపిస్తామని, గౌరవప్రదంగా ఉంటేనే పొత్తులు ఉంటాయని, లేకపోతే పోటీ తప్పదని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.