ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన డిజిటల్ రేషన్ కార్డుల ( Digital ration card ) పంపిణీ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ( Shabbir Ali ) తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ ( Payal Shanker) , అనిల్ జాదవ్ ( Anil Jadhav ) , వెడ్మ బొజ్జు ( Vedma Bojju) కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో ముద్రించాలంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం నినాదాలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీంతో కార్యక్రమం మధ్యలోనే నిలిచిపోయింది . రేషన్ బియ్యం పంపిణీలో అధిక వాట కేంద్ర ప్రభుత్వానిదేనని, తప్పనిసరిగా ప్రధాని మోదీ ఫోటోను ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
పోలీసులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచనల మేరకు వారిని విడిచి పెట్టడంతో వివాదం సద్దుమణిగింది. తిరిగి ఈ కార్యక్రమాన్ని అధికారులు కొనసాగించారు .