ప్రపంచ తెలుగు సమితి ఇటీవల నిర్వహించిన మొదటి అంతర్జాల సమావేశం ఎంతగానో ఆకట్టుకుంది . యూఎస్ఏ (USA) కేంద్రంగా వరల్డ్ తెలుగు కన్సార్టియం ( World Telugu Consortium) పేరిట నిర్వహించిన సమావేశంలో ఎనిమిది దేశాలకు చెందిన 27 మంది వక్తలు , సంధానకర్తలతో కళకళలాడింది .
తెలుగు సాహిత్యంలోని అతిరధ, మహారధులు, మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు పాల్గొని వారి రచనల పై చేసిన ప్రసంగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి(Radhika Mangipudi) , షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ తదితరులు చేసిన సాహిత్య ప్రసంగాలకు వక్తల నుంచి ప్రశంసలు అందాయి .