తిరుమల : పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు (Parinayotsavam) మే 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమల (Tirumala) లో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి (Narayanagiri) ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో మూడురోజులపాటు జరుగనున్న ఈ వేడుకలో తొలిరోజు మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. అనంతరం కల్యాణమహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తామని తెలిపారు.
పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 1992 నుంచి తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ వేడుకలు జరుగుతున్నాయని వెల్లడించారు.