ముంబయి, జూలై 23: మహారాష్ట్రలో విద్యార్థుల ఆందోళనను అక్కడి పోలీసులు అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘నిరసనల్లో మళ్లీ పాల్గొంటే మీ మీద డ్రగ్స్ కేసు పెట్టి..శాశ్వతంగా లోపలేస్తా’ అంటూ ఓ పోలీస్ అధికారి ముంబైలో కొంతమంది విద్యార్థులను బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
‘నేను మీ బ్యాగుల్లో 50 గ్రాముల మాదక ద్రవ్యాల పౌడర్ను పెడితే చాలు..మీ లైఫ్ ఖతం’ అంటూ సదరు పోలీస్ అధికారి విద్యార్థులను బెదిరించటం ఆ వీడియోలో స్పష్టంగా కనపడింది. దీనిపై స్పందించిన ముంబయి పోలీసులు, సదరు పోలీసు అధికారిని సస్పెండ్ చేసి..విచారణ చేపట్టారు.