ఢిల్లీ: ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్- 2026లో అర్హత సాధించాలంటే కీలకంగా మారిన రెండో రౌండ్ మ్యాచ్లకు భారత ఫుట్బాల్ జట్టు ప్రాబబుల్స్ 2వ జాబితాను కోచ్ ఇగార్ స్టిమాక్ ప్రకటించాడు. 15 మందితో కూడిన ఈ జాబితా (26 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదల)లో ఉన్న సభ్యులు మే 10 నుంచి భువనేశ్వర్ వేదికగా నిర్వహించబోయే ట్రైనింగ్ క్యాంప్నకు హాజరుకావాల్సి ఉంది.
జూన్లో మొదలుకాబోయే రెండో దశ పోటీలలో భారత్.. కువైట్, ఖతార్తో ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్నకు అర్హత సాధించేందుకు ఈ రెండు మ్యాచ్లే భారత్కు ఆఖరి అవకాశం.