బన్సీలాల్పేట్, మే 7 : కేంద్ర మంత్రిగా ఉండి నిధులు తేకుండా, ఉన్న నిధులు ఖర్చుచేయకుండా అభివృద్ధిని విస్మరించిన వ్యక్తికి ఓట్లు అడిగే అర్హత లేదని సికింద్రాబాద్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ అన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా గెలిచి.. కాంగ్రెస్ పార్టీనుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలిచిందని, ఆ లెక్కన భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ మంగళవారం బన్సీలాల్పేట్ డివిజన్లో ఎంపీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా బోలక్పూర్లోని శ్రీమల్లికార్జునస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుండి కృష్ణానగర్ కాలనీ, బోలక్పూర్, ఆంజనేయస్వామి కాలనీ, ఐడీహెచ్ డబుల్ బెడ్రూమ్ కాలనీ, గొల్లకొమరయ్య కాలనీ వరకు ర్యాలీ కొనసాగింది.
అడుగడుగునా వారికి అన్ని బస్తీలలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐడీహెచ్ కాలనీలో బన్సీలాల్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ఇక్కడ గెలిచి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి చేసిన అభివృద్ధి కాకుండా జైశ్రీరామ్, మోదీ పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని, ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తేలేదని, ఉన్న నిధులను కూడా ఖర్చు చేయలేకపోయారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలు మళ్లీ ఎలా ఓటువేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇప్పుడు పార్టీ మారాడని, అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించి, సికింద్రాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని అన్నారు. ఈ పాదయాత్రలో సనత్నగర్ ఎన్నికల ఇన్చార్జి బి.వెంకట్రెడ్డి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ.పవన్కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేశ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.