అమరావతి : వేసవి ఆరంభం నుంచి ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరైన ఏపీలోని పలు జిల్లాలో మంగళవారం భారీ వర్షం (Rains) కురిసింది. దీంతో కొంత వేడిమి నుంచి ఉపశమనం పొందినప్పటికి ఎండబెట్టిన వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది . ఏలూరు జిల్లా(Eluru) పోలవరం, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నూజివీడు, తిరువూరు, కైకలూరు, తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల, దేవరపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రాజమండ్రి (Rajamundry) లో కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి.
పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అచ్చంపేట, అమరావతి, క్రోసూరు మండలాలో కురిసిన భారీ వర్షాణికి మిరప(Mirchi) , మొక్కజొన్న(Maize) పంటలు దెబ్బతిన్నాయి. క్రోసూరు మండలం ఊటుకూరులో పొలం నుంచి ఇంటికి వస్తుండగా తల్లీకూతురు( Mother and Daughter) పై పిడుగుపడి మృతి చెందారు.
రాజమహేంద్రవరంలో కురిసిన వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఆర్టీసీ కాంప్లెక్స్, వీఎల్పురం, శ్యామల సెంటర్ ప్రాంతాలు జలమయమయ్యాయి. గానుగ వీధిలో రెండు భారీ వృక్షాలు నెలకొరిగాయి. విజయవాడలో ఈదురు గాలులతో చిరు జల్లులు పడగా గుంటూరు జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.