బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద కాసేపు ఆగారు. సమీపంలోని హోటల్కు వెళ్లి రైతులు, చిన్నారులు, స్థానికులతో ముచ్చటించారు. హోటల్ యజమాని వెంకటరమణయ్య ఇచ్చిన పకోడి తిన్నారు. తన దగ్గరికి వచ్చిన చిన్నారులకు అప్యాయంగా పకోడి తినిపించారు. చాయ్ తాగి, రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గులాబీ బాస్తో సెల్ఫీ దిగేందుకు యువకులు, అభిమానులు పోటీపడ్డారు. ఆయన ఓపికగా వారితో ఫొటోలు దిగారు. కేసీఆర్ వెంట నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.