హీరో అయి పాతికేళ్లు దాటుతున్నా.. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూనే ఉన్నారు రవితేజ. సీనియర్ హీరోలంతా హీరోయిన్ల కొరతతో బాధ పడుతుంటే.. రవితేజ సరసన మాత్రం యంగ్ హీరోయిన్లు పోటీపడి నటిస్తుంటారు. అందుకే రవితేజ సమ్థింగ్ స్పెషల్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ‘నామ్తో సునాహోగా’ అనేది ఉపశీర్షిక. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. హరీశ్శంకర్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ సినిమాని నిర్మిస్తున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్, హైదరాబాద్ల్లో ఈ సినిమాకు చెందిన మేజర్ టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేశారు హరీశ్శంకర్. ఇక పాటలే బ్యాలెన్స్. అందుకోసమే ఈ వారం చిత్రయూనిట్ ఆమెరికా వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం హరీశ్శంకర్ అమెరికాలోనే ఉన్నారట. లొకేషన్ సెర్చింగ్ నిమిత్తం అక్కడ ఆయన బసచేసినట్టు తెలుస్తున్నది. మిక్కీ జె.మేయర్ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి పనోరమా స్టూడియోస్, టి.సిరీస్ సమర్పిస్తున్నది.