తిరుమల : తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ (Lorry) విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్ లేలాండ్ (Ashok leyland) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో(TTD EO) ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్టుమెంట్ వేచియున్నారు. నిన్న స్వామివారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 2.96 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.