ఛత్తోగ్రమ్: స్వదేశంలో జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ జోరు కొనసాగుతోంది. మంగళవారం ఛత్తోగ్రమ్ వేదికగా ముగిసిన మూడో టీ20లో ఆతిథ్య జట్టు 9 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఉత్కంఠ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 165/5 పరుగులు చేయగా ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 156/9 వద్దే ఆగిపోయింది.