న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షకు అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ నెల 5న దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఫలితాలు జూన్ 14న వెలువడుతాయి. పరీక్ష రాయనున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.exams.nta.in/NEET/ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ పరీక్షకు 24 లక్షల మందికిపైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దీనికోసం దేశవ్యాప్తంగా 557, విదేశాల్లో 14 సిటీల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు.