అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు పార్టీల కూటమిపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సెటైర్లు (Satires ) విసిరారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన తోడు దొంగలుగా పనిచేస్తున్నారని, ఒకరు తానా అంటే మరొకరు తందనా అంటున్నారని విమర్శించారు. బీజేపీ ఏపీలో రాదని బంగాళాఖాతంలో వస్తుందని ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఏపీ ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టారు. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని, అంత దిగజారే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఎవరో ఇచ్చిన స్రిప్ట్ (Script) ను మోదీ చదువుతున్నారని విమర్శించారు. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా బీజేపీ (BJP) అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
రైల్వేజోన్పై అవగాహన లేకుండా మాట్లాడారని బొత్స అన్నారు. ఏపీ ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు అమలుకుచంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. సబ్సిడీ అందక రైతులు, రియింబర్స్మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జరిగిన ఎన్నికల సమయంలో తాము పథకాలను ఏనాడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.