హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (DOST-2024) నోటిఫికేషన్ను (DOST Notification) ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, మహిళా యూనివర్సిటీ, జేఎన్టీయూ, పాలిటెక్నిక్లో డీ-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం మూడు విడుతల్లో అడ్మిషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.