TS Weather | తెలంగాణలో రాగల ఐదుజిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. బుధవారం పలుచోట్ల తేలికపాటి చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 9న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు పడుతాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లోనూ పలు చోట్ల ఈదురుగాలులతో వానలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వివరించింది.