హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శ్రీవారు కొలువైన తిరుమలతో పాటు శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న తిరుపతిలోనూ నిత్యాన్నదానం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలను దర్శించుకొనే భక్తులు.. తిరుపతిలోని దర్శనీయ ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఉంటారు.
వీరి కోసం పలుచోట్ల అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. కాగా, మే 12 నుంచి కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నట్టు టీటీడీ తెలిపింది. ఇందుకు భక్తులు రూ.వెయ్యి చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనాలని కోరింది.