KCR | కాంగ్రెస్ మోసాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా, కరెంటు మనది మనకు రావాలన్నా, బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే అందర్నీ కాపాడగలరని పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యావంతుడు, తెలివితేటలు ఉన్నవాడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. వెంకట్రామిరెడ్డి డబ్బుల కోసం, స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదని, మెదక్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రేమతో వచ్చారని స్పష్టం చేశారు.
మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి నూటికి నూరు అబద్ధాలు మాట్లాడతారని కేసీఆర్ విమర్శించారు. మోదీది ఎంత గ్యాసో.. రఘునందన్రావుది కూడా అంతే గ్యాస్.. అందులో ఏ అనుమానం లేదని అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి చేతిలో ఆయన 55 వేల ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిపోయిండని గుర్తు చేశారు. దుబ్బాక అసెంబ్లీకే చెల్లని రూపాయి మెదక్ పార్లమెంటులో చెల్లుతదా అని ప్రశ్నించారు. రఘునందన్రావును తుక్కుతుక్కుగా ఓడగొట్టి బుద్ధి చెప్పాలని కోరారు. మీరు ఇష్టమైన హామీలు ఇచ్చి మోసం చేస్తే.. నమ్మడానికి ఎడ్డోల్లం కాదని చెప్పాని స్పష్టం చేశారు. తెలంగాణ మళ్లొకసారి పిడికిలి బిగించి పోరాటానికి దిగాలని పిలుపునిచ్చారు. తాను కూడా మెదక్ జిల్లా బిడ్డనే అని కేసీఆర్ తెలిపారు. మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసిన్నో మీ అందరికీ తెలుసన్నారు. ఘనపురం ఆనకట్టను ఏ విధంగా బాగు చేసినమో మీకు తెలుసు. హల్దీ వాగు మీద ఎన్ని చెక్డ్యామ్లు కట్టినమో మీకు తెలుసు. అని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఒక విద్యావంతుడు, తెలివితేటలు ఉన్నవాడు, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఆయన డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఆయనకు ఆల్రెడీ పదవి కూడా ఉందని.. ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇవాళ కేసీఆర్ వెంబడి ఉండి.. కేసీఆర్తో పాటు తెలంగాణ అభివృద్ధి చేయాలని.. మెదక్ తనకు ప్రేమ ఉన్న ప్రాంతం కాబట్టి.. మూడు జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, నా తెలవితేటలు ఉపయోగించి ఈ జిల్లాకు ఉపయోగపడాలని.. హరీశ్రావుకు అండదండగా ఉండాలని, వెంకట్రామిరెడ్డి వచ్చిండు తప్ప ఆయన స్వార్థం కోసం కాదని స్పష్టం చేశారు. వంద కోట్ల రూపాయలతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులందరికీ సాయం చేస్తానని చెప్పారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి బ్రహ్మాండమైన కల్యాణ మండపాన్ని కట్టిస్తానని మాట ఇచ్చిండని అన్నారు. ఎన్నికల ముందు ఏ అభ్యర్థి కూడా ఇలాంటి హామీలు ఇవ్వరని అన్నారు. ఆయనకు డబ్బు ఉంది, తెలవితేటలు ఉన్నాయి. అన్ని రకాల యోగ్యులు అని చెప్పారు. మెదక్ నుంచి పోటీ చేస్తానని వెంకట్రామిరెడ్డి అడగలేదని చెప్పారు. మెదక్ కోసం నిలబడాలని తానే వెంకట్రామిరెడ్డికి సూచించానని చెప్పారు. నా మాటను గౌరవించి వెంకట్రామిరెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మెదక్ ప్రజలను కోరారు.