హైదరాబాద్ : శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో సింగపూర్లోని(Singapore) ప్రవాస భారతీయులతో డా.రామ్ మాధవ్(Dr Ram Madhav) రచించిన నూత నగ్రంధ పరిచయ కార్యక్రమం( Book launch) ఘనంగా నిర్వహించారు. రామ్ మాధవ్ ఇటీవల రచించిన ‘ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్’ (The Indian Reality: Changing Narratives, Shifting Perceptions) పుస్తక పరిచయం, విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో నిర్వహించారు.
పుస్తక రచయిత డా.రామ్ మాధవ్ తన అనుభవాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి,శ్రీ సాంస్కృతిక కళాసారథి,సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పాల్గొన్నారు.