1. లార్డ్ డల్హౌసీ హయాంలో ఈ చట్టాన్ని రూపొందించారు
2. లార్డ్ కానింగ్ హయాంలో ఈ చట్టాన్ని అమలు చేశారు
పై ప్రకటనల్లో ఏది సరైనది?
ఎ)1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
సమాధానం: సి
వివరణ: గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ (1848-56) హయాంలో ఈ చట్టాన్ని రూపొందించారు. వైస్రాయ్ లార్డ్ కానింగ్ (1856-62) హయాంలో ఈ చట్టాన్ని అమలు చేశారు. కాబట్టి ప్రకటన 1, 2 సరైనవి.
పసి వయసులోనే పెళ్లి పీటలెక్కి వితంతువుగా మిగలడం అనేది నాటి రోజుల్లో ఎక్కువగా జరిగేది. స్త్రీ పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగిన తరువాత జరగాల్సిన వివాహం ఆమె ఆడుకునే వయసులోనే జరిగేది. తల్లిదండ్రులు కన్యాశుల్కం ఆశతో వృద్ధులతో వివాహం జరిపించేవారు. లోకం తెలియని పసి వయసులో మరొకరికి ఇల్లాలిగా వెళ్లేది. పెద్ద వయసైన భర్త చనిపోతే అప్పట్లో సతీ సహగమనం వంటి దురాచారం కూడా ఉండేది. బ్రహ్మ సమాజాన్ని స్థాపించి సాంఘిక దురాచారాలపై పోరాడిన రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల సతీ సహగమనానికి చట్టపరంగా అడ్డుకట్ట పడింది. ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వితంతు వివాహాల కోసం కృషి చేశాడు.
ఎ) రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
బి) పార్లమెంట్ ఉభయ సభల మధ్య సంబంధాలను రాష్ట్రపతి నియంత్రిస్తారు
సి) పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన చట్టాలను రాష్ట్రపతి ఆమోదిస్తారు
పై వాటిలో ఎన్ని సరైనవి?
ఎ) ఒకటి బి) రెండు సి) మూడు డి) ఏదీకాదు
సమాధానం: సి
వివరణ: భారత రాజ్యాంగంలోని ఐదో భాగంలో పార్లమెంటు నిర్మాణం, అధికారాలు, బాధ్యతల గురించి వివరించారు. కేంద్ర శాసన సభను పార్లమెంటు అని 79వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ అధికరణ ప్రకారం పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. పార్లమెంటరీ తరహా వ్యవస్థ ప్రకారం భారత పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. పార్లమెంటులోని ఏ సభలోనూ రాష్ట్రపతి సభ్యుడు కానప్పటికీ, రాష్ట్రపతికి ఉన్న శాసనాధికారాల కారణంగా పార్లమెంటులో అంతర్భాగంగా గుర్తించాల్సి ఉంటుంది.
1. రెవెన్యూ వ్యయాన్ని తగ్గించడం
2. కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం
3. సబ్సిడీలను హేతుబద్ధీకరించడం
4. దిగుమతి సుంకాన్ని తగ్గించడం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
ఎ) 1, 2 బి) 1, 3 సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4
సమాధానం: (బి)
వివరణ: ప్రకటన 1: అనవసరమైన రెవెన్యూ వ్యయం ద్రవ్య లోటును పెంచుతుంది. ఇది ప్రభుత్వ వ్యయంలో మెజారిటీ భాగాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీని తగ్గింపు ఆర్థిక లోటుపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతుంది.
ప్రకటన 2: ఇది ద్రవ్య లోటును మరింత పెంచుతుంది.
ప్రకటన 3: సబ్సిడీలు/ రాయితీలు ప్రభుత్వ వ్యయం లో ప్రధాన భాగం, దాని తగ్గింపు ద్రవ్య లోటును తగ్గిస్తుంది.
ప్రకటన 4: ఇది పన్ను రాబడిని తగ్గిస్తుంది. తద్వారా ద్రవ్య లోటును పెంచుతుంది. అందువల్ల ఎంపిక బి సరైనది.
1. బెరీలియం
2. కాడ్మియం
3. క్రోమియం
4. హెప్టాక్లోర్
5. పాదరసం (మెర్క్యూరీ)
6. సీసం (లెడ్)
7. ప్లూటోనియం
పై వాటిలో ఎన్ని సరైనవి?
ఎ) నాలుగు బి) ఐదు సి) ఆరు డి) పైవన్నీ సరైనవే
సమాధానం: బి
వివరణ: హెప్టాక్లోర్ అనేది ఒక క్రిమి సంహారక మందు. ప్లూటోనియం రేడియోధార్మికతను కలిగి ఉంటుంది. కాబట్టి రోజువారీ కంప్యూటర్/ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఉపయోగించరు. అందువల్ల ఎంపిక బి సరైన సమాధానం.
వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వ్యర్థాలు) అంటారు. పాడైన టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు, ప్రింటర్లు, ల్యాప్టాప్లు, సెల్ చార్జర్లు, బ్యాటరీలు, మదర్ బోర్డులు, ఏసీలు, వాషింగ్మెషిన్లు, రిమోట్లు, సీడీలు, హెడ్ఫోన్లు, జిరాక్స్ యంత్రాలు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు (సీపీయూ), ఐపాడ్ ఫ్యాక్స్ యంత్రాలు మొదలైన వాటిని ఈ-వ్యర్థాలుగా పేర్కొంటారు. వీటి విడుదల రోజురోజుకూ అధికమవుతూ.. పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుడుంది. ఈ-వ్యర్థాల నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలను విషతుల్యం చేస్తూ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి.
– కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,