కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.. ప్రజల గుండెల్లోబలమైన ముద్ర వేసుకున్న సాయన్న కూతురిగా లాస్య రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి మరణానంతరం ఆయన ఆశయాలను నెరవేర్చడానికి అనుక్షణం పాటు పడేది. ఎమ్మెల్యే కాక ముందు నుంచి కూడా లాస్య ఫౌండేషన్ పేరుతో ప్రజలకు దగ్గరయింది. తండ్రి పేరు నిలబెడుతుందనే నమ్మకంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమెకు కంటోన్మెంటు సీటు ఇచ్చి గెలిపించారు. ప్రజలకు నాన్న కంటే ఎక్కవే చేద్దామనుకున్న లాస్య దుదృష్టవశాత్తూ మృతి చెందారు. ఇప్పుడు మనమధ్యలో లేరు. కానీ ఆమె జ్ఞాపకాలున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనుకుంది?… సాయన్న కూతురిగా లాస్య లక్ష్యమేంటో ఆమె మాటల్లోనే… 5 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నమస్తే తెలంగాణతో లాస్య నందిత ఇంటర్వూ వీడియో…