కుటుంబ పోషణతో పాటు సమాజానికి మేలు చేయాలనే సంకల్పంతో ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ వంతుగా దాతృత్వ సేవా(philanthropy services) కార్యక్రమాల్లో పాల్గొంటూ అనాథులకు అండగా నిలుస్తున్నారు. సౌత్ఆఫ్రికాలో నివాసముంటున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా( Telangana Association of South Africa) కార్యవర్గంగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం మిడ్రాండ్ (Midrand) లోని టుమెలో హోం అనే దివ్యాంగ బాలల అనాథ శరణాలయాన్ని సందర్శించారు. వారికి మూడు నెలలపాటు కావలిసిన నిత్యావసర సరుకులను అందజేశారు. తమ కార్యవర్గం ఏర్పడిన తొమ్మిదేండ్ల నుంచి సంవత్సరంలో మూడుసార్లు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నామని టాసా సభ్యులు కొప్పుల ప్రవీణ్, వడిచర్ల సంతోష్ తెలిపారు.