న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో ‘చలో పార్లమెంట్'(CJP Protests) నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ నిరసన వెనుక భారీ కుట్ర ఉన్నట్లు ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ‘సంసద్ చలో’ నిరసనల కోసం విదేశీ నిధులు అందినట్లు ఆ పిటీషన్లో తెలిపారు. అయితే తక్షణమే విదేశీ నిధులపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టాలని పిటీషన్లో కోరారు. శుక్రవారం ఆ పిల్పై విచారణ చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. అడ్వకేట్ బారున్ కుమార్ సిన్హా ఆ పిటీషన్పై వాదించనున్నారు. సతీశ్కుమార్ అగర్వాల్ ఆ పిటీషన్ ఫైల్ చేశారు.
‘సంసద్ చలో’ నిరసన వల్ల దేశ రాజధాని ఢిల్లీలో సాధారణ జనజీవితం స్తంభించిపోయినట్లు ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. నీట పేపర్ లీకేజీ అంశంతో ప్రారంభమైన నిరసన ఆ తర్వత రాజకీయ మలుపు తీసుకున్నదని, వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆందోళన నిర్వహించారని, దీని వల్ల ఢిల్లీ స్తంభించిపోయినట్లు పిటీషన్లో సిన్హా పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆ ధర్నాకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయనకు విదేశీ సంస్థలతో లింకులు ఉన్నాయని పిల్లో పేర్కొన్నారు.