న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని(Gandhi Statue) ఇవాళ రాజ్ఘాట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆ విగ్రహం 12 అడుగులు ఉంది. మహాత్మా గాంధీ చూపిన మార్గంలోనే ప్రపంచ శాంతి లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ఆమె అన్నారు. ఢిల్లీలో గాంధీ స్మారకం ఉన్న రాజ్ఘాట్కు సమీపంలోనే గాంధీ దర్శన్ ఉంది. ఆ మ్యూజియంలో ఇవాళ వివిధ రకాల ఫోజుల్లో ఉన్న గాంధీ విగ్రహాలను కూడా ముర్ము ప్రారంభించారు. యావత్ ప్రపంచాన్ని గాంధీజీ ఓ కుటుంబంలా భావించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా సోదరభావాన్ని, సహకారాన్ని, శాంతిని ఇండియా కాంక్షిస్తున్నట్లు ఆమె తెలిపారు. జీ20 సమావేశాలకు హాజరవుతున్న నేతలు గాంధీ దర్శన్ విజిట్ చేసి, గాంధీజీ గురించి తెలుసుకుంటారని భావిస్తున్నట్లు ముర్ము తెలిపారు. గాంధీజీ ఓ వెలకట్టలేని బహుమతి అని, ఆయన పాటించిన ఆదర్శాలు, విలువలు ఈ ప్రపంచానికి మార్గదర్శకాలన్నారు. ఆఫ్రికా నేత నల్సన్ మండేలా, పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లాంటి వారు గాంధీ చూపిన అహింసా మార్గంలోనే నడిచారన్నారు.
President Droupadi Murmu unveiled the 12 feet high statue of Mahatma Gandhi and inaugurated ‘Gandhi Vatika’ at Gandhi Darshan, New Delhi. The President said that Mahatma Gandhi is a boon for the entire world community. His ideals and values have given a new direction to the whole… pic.twitter.com/DW0EsvdfPA
— President of India (@rashtrapatibhvn) September 4, 2023