Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) స్పందన కోరింది. బెయిల్పై జార్ఖండ్ హైకోర్టు తీర్పులో జాప్యం, మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్టు చేయడాన్ని పిటిషన్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ మే 6లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ కేసులో సోరెన్ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జార్ఖండ్ హైకోర్టు తీర్పును ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
సోరెన్ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అరుణాభ్ చౌదరి వాదనలు వినిపించారు. కేసు విచారణను మళ్లీ మే రెండోవారంలో జిరగే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు ఏప్రిల్ 27న రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో సోరెన్కు షాక్ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. హేమంత్ సోరెన్ తండ్రి, జేఎంఎం అధినేత శిబు సోరెన్ సోదరుడు రామ్ సోరెన్ శనివారం ఉదయం మరణించారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 12 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే, విచారణ సందర్భంగా ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది.