Lok Sabha Elections | హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. మెదక్ ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13 మంది బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
1. ఆదిలాబాద్(ఎస్టీ) -13
2. పెద్దపల్లి(ఎస్సీ) – 49
3. కరీంనగర్ – 33
4. నిజామాబాద్ – 32
5. జహీరాబాద్ – 26
6. మెదక్ – 53
7. మల్కాజ్గిరి – 37
8. సికింద్రాబాద్ – 46
9. హైదరాబాద్ – 38
10. చేవెళ్ల – 46
11. మహబూబ్నగర్ – 35
12. నాగర్కర్నూల్(ఎస్సీ) – 21
13. నల్లగొండ – 31
14. భువనగిరి – 51
15. వరంగల్(ఎస్సీ) – 48
16. మహబూబాబాద్(ఎస్టీ) – 25
17. ఖమ్మం – 41