సింగపూర్ : ఇతరులతో సంబంధాలు కలిగిఉన్నందుకు తన ప్రియురాలిని తీవ్రంగా కొట్టి హత్య చేసిన భారత సంతతికి చెందిన వివాహితుడికి (40) 20 ఏండ్ల జైలు శిక్ష విధించారు. ఇతర పురుషులతో సంబంధాలు కలిగిఉండటంతో కలత చెందిన ఎం. కృష్ణన్ తన ప్రియురాలు మల్లికా బేగం రహమనస అబ్దుల్ రెహ్మాన్ను దారుణంగా హింసించడంతో 2019 జనవరి 17న మరణించింది. ఈ కేసులో కృష్ణన్ను గతవారం హైకోర్టు దోషిగా తేల్చిందని టుడే న్యూస్ పేపర్ వెల్లడించింది.మరో నేరానికి సంబంధించి 2018లో తాను మారిన వ్యక్తినని కోర్టుకు హామీ ఇచ్చిన కృష్ణన్ తన భార్య, గర్ల్ఫ్రెండ్లను వేధించడం కొనసాగించాడని జడ్జి వలేరి థియాన్ పేర్కొన్నారు.
కృష్ణన్ దుందుడుకు స్వభావం అతడి హింసాత్మక చర్యలకు కారణం కాగా మద్యం కూడా అతడి ప్రవర్తనపై ప్రభావం చూపిందని శిక్ష విధిస్తూ జస్టిస్ వలేరి థియాన్ వ్యాఖ్యానించారు. మహిళలపై కృష్ణన్ పదేపదే ప్రదర్శించే హింసాత్మక ధోరణిని తాను ఉపేక్షించలేనని అతడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ ఆమె పేర్కొన్నారు. కాగా, 2015 నవంబర్లో కృష్ణన్ తన గర్ల్ఫ్రెండ్తో తన ఇంట్లోని మాస్టర్ బెడ్రూంలో మద్యం సేవిస్తూ అతడి భార్యకు పట్టుబడ్డాడు.
దీంతో కృష్ణన్ను నిలదీయగా ఆమె ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో భయపడిన కృష్ణన్ భార్య పోలీస్ భద్రతను కోరింది. ఈ ఘటన అనంతరం కూడా కృష్ణన్, మల్లిక మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. 2017లో ఓ విషయంలో కోపోద్రిక్తుడైన కృష్ణన్ మల్లికపై చేయిచేసుకున్నాడని కోర్టు పత్రాలు వెల్లడించాయి. ఇక 2019లో వారిద్దరూ మద్యం సేవిస్తుండగా తనకు పలువురితో లైంగిక సంబంధాలు ఉన్నాయని ఆమె అంగీకరించడంతో కృష్ణన్ ఆమెపై దాడి చేసి తీవ్రంగా కొట్టాడు. ఆపై తీవ్ర గాయాలతో 2019 జనవరి 19న మల్లిక మరణించింది.
Read More :
Konda Vishweshwar Reddy | చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తి ఎంతో తెలుసా..?