Ajinkya Rahane | టీమిండియా(Team India) సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే(38) గురువారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు(Retirement)చెప్పారు. ముంబై దేశవాళీ క్రికెట్ నుంచి భారతదేశపు గొప్ప టెస్ట్ విజయాల వరకు తనను తీసుకువెళ్లిన క్రికెట్కు(Ajinkya Rahane) అజింక్య అన్నీ ఫార్మాట్ల క్రికెట్కు భారమైన హృదయంతో తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో టీమిండియాకి కీలకమైన టెస్ట్ సిరీస్ విజయాలలో ఒకదానిని అందించిన రహానే సోషల్ మీడియా వీడియో ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారతదేశం తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే తన కెరీర్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని తెలిపాడు.
కాగా, విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితితుల్లో అతడు ఆడిన ఇన్సింగ్స్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమై విజయాలన్నందించాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ సిరీస్లో ప్లేయర్స్ గాయాల బారిన పడినా జట్టును ముందుండి నడిపించి 2-1 తేడాతో సిరీస్ నెగ్గి ఇండియన్ క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించికున్నాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రహానే కృత కృతజ్ఞతలు తెలిపాడు. టీమిండియా నుంచి వీడ్కోలు తీసుకున్నప్పటికి తనకిష్టమైన క్రికెట్ నుంచి దూరం కానని, ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.