Thomus Uber Cup : ప్రతిష్ఠాత్మక థామస్ ఉబెర్ కప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్(Team India) జోరు కొనసాగిస్తోంది. ఈసారి కూడా టైటిల్కు మరింత చేరువైంది. సోమవారం ఇంగ్లండ్(England)పై అద్భుత విజయంతో టీమిండియా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. పురుషుల గ్రూప్ సిలో ఉన్న ఇంగ్లండ్కు భారత షట్లర్లు చుక్కలు చూపించారు. గ్రూప్ పోరులో హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) రఫ్పాడించాడు.
తన రాకెట్ పవర్ చూపిస్తూ 21-15, 21-15తో హ్యారీ హౌంగ్ను ప్రణయ్ మట్టికరిపించాడు. కిడాంబి శ్రీకాంత్ వరుస సెట్లలో 21-16, 21-11తో నదీమ్ డల్వీని ఓడించాడు.ఇక డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం సంచలన ఆటతో ఇంగ్లండ్ జోడీకి చెక్ పెట్టింది.
Defending champions on #TeamIndia‘s campaign so far 🗣️
📸: @badmintonphoto #ThomasUberCupFinals#ThomasCup#IndiaontheRise#Badminton pic.twitter.com/pgx7RfqCpd
— BAI Media (@BAI_Media) April 29, 2024
ఆట ఆరంభంలో తడబడినా అనూహ్యంగా పుంజుకొని 21-17, 19-21, 21-15తో గెలుపొందింది. దాంతో, భారత జట్టు 5-0తో ఆధిక్యం సాధించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నమెంట్ తొలి పోరులో థాయ్లాండ్ను మట్టికరిపించిన భారత ఆటగాళ్లు.. తర్వాతి పోరులో ఇండోనేషియాతో అమీతుమీ తేల్చుకోనున్నారు.
చైనా వేదికగా జరుగుతున్నఈ మెగా టోర్నీలో అశ్మిత చాలిహ(Ashmita Chaliha) నేతృత్వంలో అమ్మాయిలు సైతం అదరగొడుతున్నారు. వరుసగా రెండు విజయాలతో 8వ స్థానంలో కొనసాగుతున్నారు. గ్రూప్ ఏ చివరి పోరులో భారత షట్లర్లకు చైనా సవాల్ ఎదురవ్వనుంది.