అమరావతి : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో తెలియదు పాపం. నవ మాసాలు మోసి.. పెంచి పెద్ద చేసిన ఆ మాతృమూర్తే తన చేతులతో కన్నబిడ్డల( Children died) ఉసురు తీసింది. కంటికి రెప్పలా కాపాడిల్సిన కన్నతల్లే వారిపాలిట ఉరితాడై ప్రాణాలు తీసింది. ఈ హృదయవిదాకర సంఘటన వైఎస్సార్ జిల్లాలోని(YSR district)వల్లూరు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు గ్రామాని చెందిన ఓ మహిళ వల్లూరు సమీపంలోని పంటపొలాల్లోని ఓ చెట్టుకు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి( Hanging) ఆపై తను బలవన్మరణానికి(Commits suicide) పాల్పడింది.
గమనించిన స్థానికులు పోలీసులు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య,భర్తల మధ్య గొడవ తలెత్తడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెదండంతో చెన్నూరులో విషాదం నెలకొంది.