తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి . టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD ) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 57,909 మంది భక్తులు దర్శించుకోగా 32,403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం ( Hundi Income) రూ. 3.81 కోట్లు వచ్చిందని వివరించారు. నంగునేరి వనమామలి మఠానికి చెందిన పరమహంసేత్యంతి మధురకవి వనమామాలి జీయర్స్వామి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు. ఆలయ డీఈవో లోకనాధం, పీష్కార్ శ్రీహరి, పర్పతేయాదార్ తులసీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.