Itel S24 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐటెల్ (Itel) తన ఐటెల్ ఎస్24 (Itel S24) ఫోన్ను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరించారు. 108-మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ సెన్సర్తో వస్తోంది. జూన్ నెలలో భారత్ మార్కెట్లో ఐటెల్ ఎస్24 ఫోన్ ఆవిష్కరిస్తారని సమాచారం. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. ఐటెల్ ఎస్24 ఫోన్ కొనుగోలు చేసిన వారికి లాంచ్ డే ఆఫర్ కింద ఐటెల్ ఐకాన్ స్మార్ట్ వాచ్ ఫ్రీగా అందజేస్తారు. ఈ వాచ్ ధర రూ.2,095 ఉంటుందని భావిస్తున్నారు. మీడియాటెక్ హెలియో జీ91 ఎస్వోసీ చిప్ సెట్ ఉంటది. కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఐటెల్ ఎస్24 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. మూడు కలర్ ఆప్షన్లు – కోస్ట్ లైన్ బ్లూ, డాన్ వైట్, స్టారీ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటది. మీడియాటెక్ హెలియో జీ91 చిప్ సెట్, 18 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల హెచ్డీ+ (1,612x 720 పిక్సెల్స్ రిజొల్యూషన్) డిస్ ప్లే, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) మద్దతుతో 108-మెగా పిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ హెచ్ఎం6 సెన్సర్, 3ఎక్స్ ఇన్ సెన్సర్ జూమ్, క్యూవీజీఏ డెప్త్ సెన్సర్ ఉంటాయి.