KCR | ఉస్మానియా యూనివర్సిటీలో తాగు నీటి, విద్యుత్ కొరత కారణంగా విద్యార్థులు గత నాలుగైదు రోజుల నుంచి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గత నాలుగు నెలలుగా విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరాపై సీఎం, డిప్యూటీ సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ ట్వీట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే తాగునీటి, విద్యుత్ కొరతకు నిదర్శనమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్, తాగు, సాగునీరు ఎద్దడి ఉన్నమాట వాస్తవం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కరెంట్ కొరత, తాగునీటి ఇబ్బంది కారణంగా విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోవాలని ఓయూ చీఫ్ వార్డెన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యుత్, తాగునీటి కొరత కారణంగా విద్యార్థులు ఓయూలో ధర్నా చేపట్టారు. ఒక్క ట్యాంకర్ నీళ్లు దేనికి సరిపోతాయని ఓయూ అధికారులను విద్యార్థినులు నిలదీశారు. ఓయూ చీఫ్ వార్డెన్ను విద్యార్థులు కలిసి తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Telangana CM and Dy CM were misleading the people on power, irrigation and drinking water supply in the state for the past 4 months.
Notice of Osmania University Chief Warden confirms that all their claims were farce.
The truth is that there is power, drinking water and… pic.twitter.com/PU213BFiuN
— KCR (@KCRBRSPresident) April 29, 2024