Heroin Seize | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఎస్ఎఫ్ సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుపై నిఘా పెంచింది. ముర్షిదాబాద్ జిల్లా అంతర్జాతీయ సరిహద్దు వద్ద బోర్డర్ పోస్ట్ డీఎంసీ, 149వ కార్ప్స్ 2.2 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. స్మగ్లర్లు భారత్ నుంచి బంగ్లాదేశ్కు స్మగ్లింగ్ చేయాలని ప్రణాళిక రూపొందించగా.. భగ్నం చేశారు. పట్టుబడి హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.2.2కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
ఆదివారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగులతో సరిహద్దుకు సమీపంలో వచ్చిన ముగ్గురు స్మగ్లర్లను సైనికులు గమనించారు. సైనికులను గమనించిన స్మగ్లర్లు ప్యాకెట్లను బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి విసిరేందుకు ప్రయత్నించారు. అవి భారత భూభాగంలోనే పడిపోయాయి. చీకటి కావడంతో మొక్కజొన్న పంట సమీపంలో ఉండడంలో అందులోకి దూరి స్మగ్లర్లు తప్పించుకున్నారు. అనంతరం సంఘటనా స్థలంలో సైన్యం తనిఖీలు నిర్వహించింది. పసుపు రంగు ప్లాస్టిక్ తాడుతో కట్టిన తెలుపు, ఎరుపు రంగు ప్లాస్టిక్ సంచుల్లో తెల్లటి పౌడర్ లభించింది. స్వాధీనం చేసుకున్న పౌడర్ను పరీక్షించగా హెరాయిన్గా తేలింది. హెరాయిన్ను లాల్గోలా పోలీస్స్టేషన్లో అప్పగించారు.