హైదరాబాద్ : ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్తో(Short circuit) భారీగా నగదు దగ్ధమైంది. ఈ సంఘటన సూర్యాపేటలో(Suryapet) జిల్లా కోదాడ మండలం గుడిబండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న రాత్రి కొందరు దుండగులు ఏటీఎంలో(ATM) చోరీకి యత్నించారు. ఏటీఎంలో నగదు ఎంతకీ రాకపోవడంతో దుండగలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే దుండగులు వెళ్లిన కొద్దిసేపటికే ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకొని రూ.8.12 లక్షలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని స్పష్టం చేశారు.