హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad Airport) చిరుతపులి(Leopard) ఆచూకీ కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు(Forest officials) తీవ్రంగా శ్రమిస్తున్నారు. ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. కాగా, విమానాశ్రయం ప్రహరీ లోపలి భాగంలో ఆదివారం తెల్లవారుజామున చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు ఎయిర్పోర్టు సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆర్జీఐఏ పోలీసులు సూచించారు. చిరుతను త్వరలోనే పట్టుకుంటామన్నారు.