హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్కు బానిసలైన యువకులు, విద్యార్థులు డబ్బుల కోసం దొంగతనాలు, చైన్స్నాచింగ్లకు అలవాటు పడుతున్నారని ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్శాండిల్య ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నియంత్రణ, సమర్థ ఇంటెలిజెన్స్ను పెంపొందించే క్రమంలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు.
ఆయా జిల్లాల స్పెషల్ బ్రాంచ్ ఇన్చార్జులు, నారోటిక్స్ డిటెక్షన్ డాగ్స్ (ఎన్డీడీ) ఇన్చార్జులు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు హాజరైన వర్క్షాపులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం యువత, చిన్నారుల్లో ఎక్కువగా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలపై ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు.