Loksabha Elections 2024 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బిహార్లోని బెగుసరాయ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ మనదని, కశ్మీర్తో రాజస్ధాన్, బిహార్కు ఏం సంబంధం అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అంటున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, లాలూ ప్రసాద్ యాదవ్ గత 70 ఏండ్లుగా ఆర్టికల్ 370ని తమ అక్రమ సంతానంలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆర్టికల్ 370 రద్దు చేశారని గుర్తుచేశారు.
ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కశ్మీర్లో రక్తపుటేరులు పారతాయని హెచ్చరించారని అన్నారు. అయితే గత ఐదేండ్లుగా ఒక్క చిన్న రాయి కూడా ఎవరూ విసరలేదని అమిత్ షా గుర్తుచేశారు.
Read More :